తెల్సా కవితల పోటీ – 2022: ఫలితాలు
తెల్సా కవితల పోటీ – 2022 కి దాదాపు 150 కవితలు వచ్చాయి. మాకు వచ్చిన కవితలన్నిటినీ శ్రద్ధగా పరిశీలించాము. పోటీకి వచ్చిన కవితల్లో మేము ప్రకటించిన బహుమతులు అందుకొనే కవితలు దొరకలేదు. అందువల్ల విశిష్టమైనవిగా గుర్తింపు పొందిన నాలుగు కవితలకు ₹10,000 చొప్పున, మరొక మూడు కవితలకు ₹8,000 చొప్పున పారితోషికంగా ఇద్దామని నిర్ణయించాము.
₹10,000 పారితోషికం పొందిన కవితలు (అకారాది క్రమంలో)
- ఆగిపోయిన చోటునుండే — బండ్ల మాధవరావు
- ఒకానొక సార్థక సవారీ — దొండపాటి నాగజ్యోతిశేఖర్
- నువ్వే ఒక పాలపుంత — డాక్టర్ సుంకర గోపాలయ్య
- షష్ఠముడు — కె. ఎ. ముని సురేష్ పిళ్ళై
₹8,000 పారితోషికం పొందిన కవితలు (అకారాది క్రమంలో)
- ఏదో ఒకటి మాట్లాడు — చొక్కర తాతారావు
- నా లోకి నదిని ప్రవహించనీయండి — దాట్ల దేవదానం రాజు
- మరణానికి మరో చూపు — ‘దేశరాజు’
బహుమతి పొందిన కవితలూ, కథలూ మా వెబ్ పత్రిక “సంగతి”లో ప్రచురిస్తాము. కవితలకు కొన్నిరోజులలో బాంకు ద్వారా పారితోషికం పంపుతాము.
పోటీలో గుర్తింపు పొందిన కవులను అభినందిస్తూ, పోటీకి తమ కవితలు పంపిన అందరికీ మరోసారి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
1 Comment. Leave new
శ్రేయులకి నమస్కారము…..కథల పోటి విజేతల వివరాలు తెలపగలరు